గుడివాడ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలోని నందమూరు వద్ద గడ్డితో వెళ్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ద్విచక్ర వాహనదారులు, భారీ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను పక్కకు నిలిపివేయాల్సి వచ్చింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.