గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం గుడివాడ 13వ వార్డు బాపూజీ నగర్ లో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానల్ కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. ప్రతీ ఇంటినీ సూర్యఘర్ వెలుగులతో నింపుకోవాలని ఆయన సూచించారు.