గుడ్లవల్లేరు: తాగునీటి సరఫరా పరిశీలన
గుడ్లవల్లేరులోని ఇందిరా కాలనీలో నీటి సరఫరా జరగడం లేదనే సమాచారం మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించారు. బుధవారం పంచాయతీ అధికారి నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం, ఇందిరా కాలనీ, నెహ్రూ కాలనీలకు గ్రామంలోని 60 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. ప్రజలు తమ అవసరాలకు తగినట్లుగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు.
