కిరాణా దుకాణమే లక్ష్యంగా మాయగాడు ఫేక్ ఫోన్ పే యాప్తో పంజా విసిరాడు. రైతు బజార్ సమీపంలోని ఓ షాపులో కస్టమర్లా నటించి మూడు ప్రీమియం బియ్యం బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించినట్లు నకిలీ స్క్రీన్ షాట్ చూపించి పరారయ్యాడు. తీరా ఖాతా పరిశీలించిన యజమాని, నగదు జమ కాలేదని గుర్తించి లబోదిబోమన్నాడు. తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.