కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో (పెద్ద శివాలయం) జ్వాలా తోరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టారు. ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు, అధికారులు హాజరయ్యారు.