జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం నుంచి గండ్రాయి వెళ్లే మార్గంలో వీచిన భారీ గాలిదుమ్ము కారణంగా పెద్ద చెట్లు రోడ్డుపై కూలిపోయాయి. దీనితో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించడంతో ప్రయాణికులు రాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.