పెనుగంచిప్రోలులో ఒక వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు భర్త వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న, పిల్లలతో కలిసి ఆధార్ అప్డేట్ చేయిస్తానని చెప్పి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో, వేణు అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని భర్త పేర్కొన్నారు. ఈ ఘటనపై పెనుగంచిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.