మంగళవారం సాయంత్రం పెనుగంచిప్రోలులో ముస్లిం మత పెద్దలతో ఎస్సై అర్జున్ సమావేశమయ్యారు. బక్రీద్ రోజున గోవధ చేయకూడదని, ఎక్కడైనా గోవధ జరుగుతున్నట్లు తెలిసినా, చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీనికి మత పెద్దలు సహకరిస్తామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.