జగ్గయ్యపేట పాలేటి ఒడ్డున మొన్నటి వరదల కారణంగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుకను తరలించడానికి ట్రాక్టర్లు భారీ సంఖ్యలో తిరుగుతుండటంతో ఆ ప్రాంతంలో సందడిగా మారింది. లింగాల వైపు నుండి ఇసుక రవాణాకు అధిక కిరాయి చెల్లించాల్సి వస్తుండటంతో, స్థానికులు పాలేటి ఒడ్డు నుంచే ఇసుకను తెప్పించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.