ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుండి బలుసుపాడు వెళ్లే రోడ్డులో ఈద్గా వద్ద వాగు ఉప్పొంగి రహదారిపైకి నీరు ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా వాగు ప్రవాహం పెరగడంతో రహదారి కొంతమేర నీటమునిగింది. ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. వాగు నీటిలో వాహనాలు నడపకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.