మచిలీపట్నంలో వాడపాలెం సచివాలయం విలేజ్ సర్వేయర్ రాజేశ్, పెదయాదరలోని 3.76 ఎకరాల వ్యవసాయ భూమి సర్వేకు సంబంధించి రూ.14 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారుల సూచనల మేరకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. స్థానిక మూడు స్థంభాల సెంటర్ వద్ద నడిరోడ్డుపై లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రాజేశ్ ను పట్టుకున్నారు.