మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వివాదాస్పద అంశాలతో నిత్యం విమర్శల పాలవుతోంది. సిబ్బంది చేతివాటం, అంబులెన్స్ దోపిడీతో పాటు ఇప్పుడు అనాథ శవాల అదృశ్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. కొంతకాలంగా అనాథ శవాలతో కొందరు వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.