కృష్ణా జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పేర్ని నాని జిల్లా రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మచిలీపట్నంలో రెవిన్యూ యంత్రాంగ తీరుపై పిజిఆర్ఎస్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ కు ఫిర్యాదు చేశారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇద్దరు ఎమ్మార్వోలు, ఆర్డీవో సాంబశివరావు ఆక్వా రంగ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చెరువుల మరమ్మతులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు.