2029 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే మొదటి సీటు మచిలీపట్నమే అవుతుందని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మంగళవారం మచిలీపట్నంలో తీవ్రంగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన దుర్మార్గమైన రాజకీయాలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన ఎద్దేవా చేశారు. కొంతమంది వ్యక్తిగత కక్షలతో ప్రజల అభివృద్ధిని అడ్డుకొని రాక్షసానందం పొందారని, అందుకే ప్రజలు ఇంటిలో కూర్చోబెడతారని బాలశౌరి అన్నారు.