ఈ నెల 5న మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగే సముద్ర స్నానాలకు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శనివారం సాయంత్రం మచిలీపట్నంలో మాట్లాడుతూ, ఉదయం 5 గంటలకు సముద్ర హారతితో పుణ్య స్నానాలు ప్రారంభమవుతాయని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, బీచ్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.