మచిలీపట్నం బలరాముల పేటలో ఆదివారం మొదటి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గోపీచంద్, జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.