ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై టిడిపి కార్యకర్తలు పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేయడంతో వైసిపి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తే టిడిపి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని వైసీపీ శ్రేణులు ఘాటుగా హెచ్చరించాయి. ఈ ఘటనతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.