మైలవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 'పల్లెపండుగ 2.0' కింద రూ. 6 కోట్లు మంజూరు చేసినట్లు స్ధానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. శనివారం ఆయన విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో రూ. 30 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, పైడూరుపాడు గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో చేపట్టనున్న సీమెంట్ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.