శనివారం జి. కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఒకే బైక్పై త్రిబుల్ రైడింగ్ చేస్తూ, రాత్రి సమయంలో స్టంట్లు, స్నేక్ డ్రైవింగ్ చేస్తూ, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు భద్రతా నియమాలను విస్మరించి ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారని సీఐ కిషోర్ బాబు తెలిపారు. వీరిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.