మైలవరంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు, జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సలీమా అనే వివాహిత ఉద్యోగిని 9 నెలలుగా జీతం ఇవ్వడం లేదని, దీంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో స్థానిక పోలీసులు బాధితురాలిని, ఫైనాన్స్ ఆఫీసు ఉద్యోగులను స్టేషన్కు తరలించారు.