మైలవరం(M)లో గురువారం 43.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. శుక్ర, శనివారాలలో 43.7, 42.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని హెచ్చరించింది. మండలంలో ఉష్ణోగ్రతలు కారణంగా వాడగాలు వీచే అవకాశం ఉందని సూచించింది. అత్యవసరమైతేనే మంచినీళ్లు సీసాతో బయటికి రావాలని పేర్కొంది. రైతులు, ఉదయం 11 గంటల కల్లా పనులు ముగించుకోవాలని, చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని కోరారు.