కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులను ఖండిస్తూ, ఇబ్రహీంపట్నంలో సీపీఎం నిరసన చేపట్టింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వామపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీఐబీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి మహేష్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగితే దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీపీఎం పిలుపునిచ్చింది.