ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. ఎక్సైజ్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ అరెస్టుతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.