బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. జూపూడికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. జుజ్జురుకు చెందిన ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.