సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇబ్రహీంపట్నంలో శనివారం వాలీబాల్, పొట్టేళ్ల పోటీలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తున్న రావి ఫణిని ఆయన అభినందించారు.