మైలవరం మండలంలో ఈ నెల 10న ఆరేళ్ల బాలికపై 33 ఏళ్ల వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పోక్సో కేసు నమోదైతే ఏళ్ల తరబడి జైలు శిక్ష పడి జీవితం నాశనమవుతుందని సీఐ కిషోర్బాబు హెచ్చరించారు.