మైలవరంలో సంభవించిన ప్రకృతి వైపరీత్యం కారణంగా విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వివిధ ప్రాంతాల్లో దాదాపు 400 విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, 55కు పైగా ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. ఎన్నడూ లేని విధంగా ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించిందని, అయితే వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు.