మైలవరం పోలీసులు టాక్టికల్ అర్బనిజంలో భాగంగా బుధవారం రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమణలను తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు CI కిషోర్ బాబు, SI సుధాకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న షాపుల వస్తువులను తొలగించి, యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి రోడ్డుపై షాపులు కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.