సోమవారం రాత్రి నాగులూరులో శ్రీ బాల ఆరేటమ్మ, తిరుపతమ్మ, అంకమ్మ తిరునాళ్ళ మహోత్సవాలు ముగిశాయి. గురువారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ప్రభల ఊరేగింపులతో గ్రామంలో కోలాహలంగా జరిగాయి. ప్రభలను వీధులలో ఊరేగించి ఆలయానికి చేర్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.