కొండపల్లి పారిశ్రామికవాడలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)ను ఎన్డీఆర్ఎఫ్ బృందం సోమవారం సందర్శించింది. కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్లను కలిసి రక్షణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 180 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆయిల్ కంపెనీలో, విశాఖపట్నం-విజయవాడకు పైపులైన్ ద్వారా వచ్చే చమురు, నిల్వచేసే ట్యాంకులు, ట్యాంకర్ల ద్వారా బంకులకు పంపే విధానాన్ని అధికారులు పరిశీలించారు.