మైలవరం నుండి సజ్జపాడు వెళ్లే రహదారి గుంతలతో నిండిపోయి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత 20 ఏళ్లుగా ఈ రహదారికి మరమ్మతులు జరగలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.