జి. కొండూరు మండలం వెల్లటూరు
గ్రామంలో అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ సీఐ కీలకపాత్ర వహిస్తున్నారని, సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన స్పందించడం లేదని అన్నారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోకపోతే సోమవారం పీజిఆర్ఎస్లో వినతి పత్రాలు సమర్పిస్తామని ప్రజలు తెలిపారు.