జి. కొండూరు మండలం వెంకటాపురంలో ఆదివారం ఒక ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న వాహనాన్ని లారీ అదుపుతప్పి ఢీకొట్టడంతో అది నుజ్జయిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు వాహనదారుడు తెలిపారు.