వీరులపాడు మండలం జుజ్జూరులో శనివారం అర్ధరాత్రి ఓ పిచ్చికుక్క కలకలం సృష్టించింది. ఇళ్ల బయట నిద్రిస్తున్న 10 మందిపై ఆకస్మికంగా దాడి చేసి గాయపరిచింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు ఉదయాన్నే అప్రమత్తమై, కర్రలతో ఆ కుక్కను వెంబడించి పట్టుకుని అంతమొందించారు. తమ ప్రాణ రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నామని స్థానికులు తెలిపారు.