నందిగామ ఎంపీడీవో ప్రసాద్ రావు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించి, ఈ-క్రాప్, యూనిఫైడ్ సర్వేలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని, ఐవీఆర్ఎస్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా పెండింగ్ పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.