నందిగామలో సైబర్ నేరాల నివారణపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐ మహతి, మోహన్ రావు, ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ గాంధీ సెంటర్ వద్ద వాహనదారులకు సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, హెల్మెట్ ధరించడం, అతివేగం నివారించడం, వాహన పత్రాలు వెంట ఉంచుకోవడం తప్పనిసరి అని హెచ్చరించారు.