పండుగ నేపథ్యంలో విజయవాడ మార్గంలోని టోల్ ప్లాజాలలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఈ పరిస్థితిని సమీక్షించడానికి డీసీపీ లక్ష్మీనారాయణ కీసర టోల్ ప్లాజాను పరిశీలించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలోని కీసర టోల్ ప్లాజాలో వందలాది వాహనాల రద్దీని నియంత్రించడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు ఎనిమిది టోల్ బూత్లను తెరిచినట్లు తెలిపారు. ట్రాఫిక్ జామ్లను నివారించడానికి అదనపు సిబ్బందిని కూడా నియమించారు.