కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పూజా కార్యక్రమంలో భాగంగా, లోక కళ్యాణం కోసం రాజశ్యామల యోగం నిర్వహించినట్లు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. గురువారం అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.