మొవ్వలో పది రోజుల క్రితం జరిగిన బైక్ దొంగతనం కేసులో ఎస్సై విశ్వనాథ్ ముగ్గురు దొంగలను సోమవారం అరెస్ట్ చేశారు. కోసూరుకు చెందిన పెదపూడి రత్నగిరి, డొక్కు సుధాకర్, బొర్రా సాయిబాబులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించామని ఎస్సై తెలిపారు.