వాతావరణంలో మార్పుల కారణంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, స్క్రబ్ టైఫస్ ఫీవర్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని పామర్రు సీజీహెచ్ వైద్యాధికారి డా. సూధేష్ బాబు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం, నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించాలని ఆయన మంగళవారం సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.