రాష్ట్రంలో ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభమైనా, కూటమి ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులను కూడా మోసం చేసిందని ఆరోపించారు.