మంగళవారం పామర్రు మండలం నిభానిపూడి కాలువలో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు వెంటనే పామర్రు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.