మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ ను బైక్ పై అనుసరిస్తున్న ఇద్దరు యువకులు పామర్రు మండలం కనుమూరు గ్రామ పరిధిలోని రొయ్యల ఫ్యాక్టరీ వద్ద అదుపుతప్పి పడిపోవడంతో గాయపడ్డారు.