మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దురుసుగా ప్రవర్తించారని, ఈ నేపథ్యంలో ఆయనపై చట్టప్రకారం కేసు నమోదు చేశామని కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని, అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.