పామర్రు మండల పరిధిలోని కొండిపర్రులో కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పామర్రు పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటనలో పందేలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.