తోట్లవల్లూరు మండలం గరికిపారు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పశువుల సావిడిలో 30 జీవాలు, గొర్రెపోతులు, పశువులు, కోళ్లు, నీటి పరికరాలు, ప్లాస్టిక్ వాటర్ టబ్ లు కాలిపోయాయి. స్థానికులు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.