గూడూరు మండలం లేళ్లగరువులో గురువారం రాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ దివ్య ప్రకాష్ నేతృత్వంలో జరిగిన ఈ సోదాలో వారి వద్ద నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.