గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పెడన పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరవేగంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. బుధవారం, ఆయన టీడీపీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ పార్క్లో 15వ ఆర్థిక సంఘం నిధులైన సుమారు రూ. 11.36 లక్షలతో చేపట్టిన వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ బెంచెస్, వాల్ పెయింటింగ్ పనులను పరిశీలించారు.