శుక్రవారం కానూరు పంట కాల్వ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగర నారాయణరావు (70) అనే వృద్ధుడు మృతి చెందారు. స్కూటీపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి బంధువు పాలూరి రవికిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.