పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ కుటుంబ బంధాలు బలపడేలా, విభేదాలు తొలగేలా ప్రజలంతా ఐక్యతతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని పోరంకిలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ముందస్తు హోలీ వేడుకలు నిర్వహించారు. మహిళలతో కలిసి నృత్యాలు చేస్తూ, రంగుల జల్లులతో ఉత్సాహంగా పాల్గొని, పండుగ కానుకలను ఎమ్మెల్యే అందజేశారు.